బాలుడి చివరి కోరిక.. అమ్మ సమాధి పక్కనే పూడ్చిపెట్టండి..
- March 28, 2017అమ్మకు క్యాన్సర్.. బిడ్డను కూడా ఆ ప్రాణాంతక మహమ్మారి వదిలిపెట్టలేదు. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అయితే బిడ్డ ఆమె వెంటే వెళ్లిపోయాడు. కేన్సర్కు చికిత్స పొందుతున్న లండన్లోని ఆస్పత్రిలో మృతి చెందిన ఏడేళ్ల బాలుడి చివరి కోరిక విని ప్రపంచం కన్నీళ్లు పెట్టుకుంది. శుక్రవారం అమ్మతో పాటు శాశ్వతంగా ఈ లోకానికి దూరమైన ఫిలిప్ క్వాస్ని అనే ఏడేళ్ల బాలుడు చివరి కోరిక ఏంటో వింటే కంట నీరు రాక తప్పదు. క్యాన్సర్ బారిన పడిన ఆ బాలుడు తన తల్లి సమాధి పక్కనే తనను పూడ్చి పెట్టాలన్నాడు. అలా చేస్తే స్వర్గంలో ఉన్న అమ్మ తనను బాగా చూసుకుంటుందని చెప్పాడు. ఈ మాట విన్న అనేక హృదయాలు కరిగిపోయాయి. బాలుడి చివరి కోరిక తీర్చేందుకు ప్రపంచం ముందుకొచ్చింది.
2011తో ఫిలిప్ తల్లి ఎజ్నియెస్కా కూడా కేన్సర్తోనే మృతి చెందారు. తండ్రి పీటర్తో కలిసి ఉంటున్న ఫిలిప్కు కేన్సర్ సోకినట్టు గతేడాది సెప్టెంబరులో గుర్తించారు. బాలుడికి సోకిన జువెనైల్ మైలోమోనోసైటిక్ ల్యుకేమియా(జేఎంఎంఎల్) నుంచి రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అయితే బాలుడి కోరిక తీర్చేందుకు 6500 పౌండ్లు అవసరం కాగా, దాతల ద్వారా 41వేల పౌండ్లు విరాళంగా అందాయి. చనిపోతాననే విషయం ఫిలిఫ్కు తెలుసునని.. తన చేతుల ద్వారా కుమారుడిని పూడ్చి పెట్టాల్సి వస్తుందని ఊహించలేకపోయానని పీటర్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఫిలిప్ చివరి కోరిక తీర్చేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపాడు.
తాజా వార్తలు
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం
- కొనసాగుతున్నమూడో విడత పోలింగ్..