తమిళనాడు లో రజనీకాంత్కు వ్యతిరేకంగా ఆందోళనలు
- May 22, 2017
తమిళనాట అగ్గి రాజుకుంది. రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై సస్పెన్స్ వీడక ముందే... తమిళ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. తలైవా.. తమిళుడు కాదని.. కన్నడిగుడనే వాదనని ప్రధానంగా తెరపైకి తెస్తున్నారు. చెన్నైలోని రజనీకాంత్ నివాసం ముందు ఆందోళనకు దిగారు. అటు.. కోయంబత్తూరులో కబాలి దిష్టిబొమ్మను తగులబెట్టారు.
తమిళనాట రజనీకాంత్ తిరుగులేని స్టార్ హీరో. ఆయన వెటరన్గా మారినా, నవతరం యువ కథానాయకులు వచ్చినా.. తలైవా ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదు. అరుణాచలం, నరసింహ సినిమాల దగ్గరి నుంచి ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై తరచు వార్తలు వస్తున్నాయి. అయితే.. రీసెంట్గా ఆయన పాలిటిక్స్పై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు. మూడు రోజులు ప్యాన్స్తో సమావేశమై తన మనసులో మాట బయటపెట్టారు. రాజకీయాలపై రజనీకాంత్కు పిచ్చ క్లారిటీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఆందోళనల్ని కూడా ఆయన ముందే ఊహించారు. తాను జన్మతహ తాను తమిళుడ్ని కాకపోయినా.. ఇన్నేళ్ల అనుబంధంతో పూర్తిగా తమిళుడ్ని అయ్యానంటూ ఫ్యాన్స్ ముందు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు ఆయన స్థానికతను ఇష్యూ చేస్తూ తమిళ సంఘాలు ఆందోళనకు దిగాయి. చెన్నైలోని సూపర్స్టార్ నివాసం ముందు ధర్నాకు దిగిన నిరసనకారుల్ని పోలీసులు అదుపు చేశారు. మరోవైపు.. తమిళనాడులోని మిగతా పట్టణాల్లోను ఆందోళనలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన









