తీపికబురు వచ్చే నాలుగైదేళ్లలో 25 లక్షల ఐటీ ఉద్యోగాలు
- May 25, 2017
ఉద్వాసన భయంతో ఐటీ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్న సమయంలో కేంద్రం ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తీపికబురు చెప్పారు. వచ్చే నాలుగైదేళ్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో 20-25 లక్షల ఉద్యోగాలు రానున్నాయని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. మూడేళ్ల మోదీ పాలనలో తన మంత్రిత్వశాఖ సాధించిన విజయాల గురించి ఓ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఈ విషయం తెలిపారు. డిజిటల్ ఎకానమీ రోడ్ మ్యాప్ తయారీ కోసం కన్సల్టెన్సీ సంస్థ మెకెన్సీని నియమించినట్టు పేర్కొన్నారు. వచ్చే 5-7 ఏళ్లలో దేశంలోని డిజిటల్ ఎకానమీ ఒక ట్రిలియన్కు చేరుకుంటుందన్నారు. ఐటీ రంగం నుంచి ఉద్యోగులు పెద్దమొత్తంలో ఉద్వాసనకు గురికానున్నట్టు వస్తున్న వార్తను ఖండించిన రవిశంకర్ ప్రసాద్ వచ్చే నాలుగైదేళ్లలో 20-25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నట్టు చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









