ఈనెల 26న కేసీఆర్కు ఆపరేషన్
- June 25, 2017
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు గత మూడు రోజులుగా డాక్టర్లు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆ తర్వాత ఈనెల 26వ తేదీన ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఇంతకీ ఈ ఆపరేషన్ ఏంటనేకదా మీ సందేహం.
ఎన్డీయే కూటమి తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రామ్నాథ్ గోవింద్ నామిషన్ కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. గత మూడు రోజులుగా ఢిల్లీలోని కేసీఆర్ అధికార నివాసమైన 23, తుగ్లక్ రోడ్డులో ఉంటున్నారు. ఈయనకు మూడు రోజులుగా వైద్య పరీక్షలు చేస్తున్న వైద్యులు.. ఇంటికి వచ్చి కళ్లలో చుక్కల మందు వేస్తున్నారు. కుడి కంటిపై పొర ఏర్పడటంతో సీఎం చూపు కాస్త మందగించింది. దాన్ని తొలగించడానికి ఆపరేషన్ చేయనున్నారు.
వాస్తవానికి, గత నెలలో ఢిల్లీకి వచ్చినప్పుడే ఆయన ఆపరేషన్ చేయించుకోవాలని భావించారు. ఆపరేషన్ అవసరమా లేదా మందులతో తగ్గిపోతుందా? అన్న సందేహంతో డాక్టర్లు ఆపరేషన్ వాయిదా వేశారు. తాజాగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స నిర్వహిస్తే మంచిదని నిర్ణయించారు. దీంతో ఆపరేషన్కు కేసీఆర్ అంగీకరించారు. కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీకి చెందిన కంటి డాక్టర్ సచ్దేవ్ ఆయనకు ఆపరేషన్ చేశారు. ఇపుడు కూడా ఆయన చేయనున్నారు.
ఆపరేషన్ తర్వాత రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత 30వ తేదీన అర్థరాత్రి పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరగబోయే జీఎస్టీ అమలు వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాతే తిరిగి హైదరాబాద్కు పయనమవుతారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









