జయభేరి ప్రాపర్టీస్ ఏపి లో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేట్టనుంది
- October 15, 2015
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరి ప్రాపర్టీస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేట్టనుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీలో, హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఈ సంస్థ పలు ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం వచ్చింది. రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లి వద్ద 1.27 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఇఐఎఎ) ఇటీవల జయభేరికి క్లియరెన్స్ ఇచ్చింది. జయభేరి కుంచనపల్లి వద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే విషయంలో రాష్ట్ర ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ సిఫార్సులను ఎస్ఎఐఎఎ ఆమోదించింది. కుంచనపల్లి అమరావతికి అతి సమీపంలో ఉంటుంది. అయితే, ల్యాండ్ పూలింగ్ ఏరియాలో ఈ గ్రామం లేదు. దీంతో మురళీమోహన్ అక్కడ తన ప్రాజెక్టులకు స్తలాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన మురళీ మోహన్ హైటెక్ సిటీలోని మాదాపూర్లో, హైదరాబాదులో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







