జయభేరి ప్రాపర్టీస్ ఏపి లో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేట్టనుంది
- October 15, 2015
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, సినీ నటుడు మురళీ మోహన్కు చెందిన జయభేరి ప్రాపర్టీస్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సమీపంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేట్టనుంది. హైదరాబాదులోని హైటెక్ సిటీలో, హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఈ సంస్థ పలు ప్రాజెక్టులను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఓ ఆంగ్ల దినపత్రికలో వార్తాకథనం వచ్చింది. రాజధాని ప్రాంతంలోని కుంచనపల్లి వద్ద 1.27 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టును చేపట్టడానికి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ (ఎస్ఇఐఎఎ) ఇటీవల జయభేరికి క్లియరెన్స్ ఇచ్చింది. జయభేరి కుంచనపల్లి వద్ద రెసిడెన్షియల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టే విషయంలో రాష్ట్ర ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ సిఫార్సులను ఎస్ఎఐఎఎ ఆమోదించింది. కుంచనపల్లి అమరావతికి అతి సమీపంలో ఉంటుంది. అయితే, ల్యాండ్ పూలింగ్ ఏరియాలో ఈ గ్రామం లేదు. దీంతో మురళీమోహన్ అక్కడ తన ప్రాజెక్టులకు స్తలాలను ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడైన మురళీ మోహన్ హైటెక్ సిటీలోని మాదాపూర్లో, హైదరాబాదులో పలు రెసిడెన్షియల్ ప్రాజెక్టులను చేపట్టి పూర్తి చేశారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









