నాగపూర్ బోటుషికారులో వీడియో.. కాసేపటికే గల్లంతు
- July 10, 2017
మహారాష్ట్రలోని నాగ్పూర్లో విషాదం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విహారయాత్రకు వెళ్లిన కొందరు యువకులు ప్రమాదంలో చిక్కుకున్నారు. కలమేశ్వర్ ప్రాంతంలోని వేనా డ్యాంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళితే..
నాగ్పూర్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు.. ఆదివారం వేనా డ్యామ్కు వెళ్లారు. సాయంత్రం సమయంలో ముగ్గురు బోట్ సిబ్బందితో కలిసి రైడింగ్ చేశారు. బోట్లో షికారు చేస్తున్న సమయంలో వారంతా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులోని వ్యక్తి ఆ వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు ముగినిపోయింది. గమనించిన స్థానికులు ఇద్దరు బోట్ సిబ్బంది, ఒక విద్యార్థిని రక్షించారు.సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని గుర్తించగా.. మరో ఏడుగురు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి గజ ఈతగాళ్లతో కూడిన రెండు బృందాలు ఇక్కడ గాలింపు చేపట్టాయని నాగ్పూర్ రూరల్ అదనపు ఎస్పీ సురేశ్ భోయత్ తెలిపారు. అయితే పడవ ఎలా మునిగిపోయిందో ఇంకా స్పష్టత రాలేదన్నారు. బోట్లో వారంతా పుట్టినరోజు వేడుకలు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం







