భారతీయ కాన్సుల్ జనరల్ను కలిసిన తెలుగు ప్రవాసీ
- July 11, 2017
దుబాయ్: దుబాయ్ లో నూతన భారతీయ కాన్సుల్ జనరల్గా నియమితులైన విపుల్ను వివిధ ప్రవాసీ సంఘాల వారు మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా తమ తమ సమస్యలను ప్రవాసులు ఆయనకు వివరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఇండియన్ పీపుల్స్ ఫోరం అనే ప్రవాస భారతీయుల స్వచ్చంధ సంస్ధ ప్రతినిధులు కాన్సుల్ జనరల్ను కలిశారు.
దుబాయ్, షార్జా నగరాల్లో తెలంగాణ ప్రవాసులు ఎదుర్కోంటున్న సమస్యలను వివరిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేయవల్సిందిగా విపుల్ను కోరినట్లు సామాజిక కార్యకర్త జనగామ శ్రీనివాస్ తెలిపారు. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన శ్రీనివాస్ షార్జాలో పని చేస్తూ కష్టాల్లో ఉన్న ప్రవాసులకు చేతనైన సాయం చేస్తూ, ప్రమాదవశాత్తూ ఎవరైనా మరణిస్తే.. వారి మృతదేహాలను స్వస్థలాలకు పంపేందుకు విశేష కృషి చేస్తుంటారు. కాన్సుల్ జనరల్ను కలిసిన వారిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఉండగా అందులో తెలంగాణ నుండి శ్రీనివాస్, పందిళ్ళ మహెందర్ ఉన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







