తిరుపతిలో గరుడ టెర్మినల్ను ప్రారంభించనున్న మోదీ
- October 20, 2015
అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతిలోని రేణిగుంట విమానశ్రయంలో గరుడ టెర్మినల్ను ప్రారంభిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు తెలిపారు. ఎల్లుండి శంకుస్థపన కార్యక్రమం పూర్తవగానే అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు మోదీ వస్తారని అశోక్గజపతిరాజు చెప్పారు. మంగళవారం అశోక్గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ గరుడ టెర్మినల్ ద్వారా 500 మంది డొమెస్టిక్, 200 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఏర్పాట్లు చేస్తామని, సివిల్ ఏవియేషన్ అనుమతి రాగానే రాకపోకలకు అనుమతి కల్పిస్తామన్నారు. వారణాసి, భువనేశ్వర్ మాదిరిగా ఏపీలో కూడా అంతర్జాతీయ విమానాల అనుసంధానానికి కృషి చేస్తామని అశోక్గజపతిరాజు చెప్పారు. దేశ వ్యాప్తంగా 32 ఎయిర్పోర్టులు నిరుపయోగంగా ఉన్నాయని, పాత టెర్మినల్స్లో కార్గో విమానాలకు అనుమతి కల్పించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







