తిరుపతిలో గరుడ టెర్మినల్ను ప్రారంభించనున్న మోదీ
- October 20, 2015
అమరావతి శంకుస్థాపనకు విచ్చేస్తున్న భారత ప్రధాని నరేంద్రమోదీ తిరుపతిలోని రేణిగుంట విమానశ్రయంలో గరుడ టెర్మినల్ను ప్రారంభిస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్గజపతిరాజు తెలిపారు. ఎల్లుండి శంకుస్థపన కార్యక్రమం పూర్తవగానే అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు మోదీ వస్తారని అశోక్గజపతిరాజు చెప్పారు. మంగళవారం అశోక్గజపతిరాజు మీడియాతో మాట్లాడుతూ గరుడ టెర్మినల్ ద్వారా 500 మంది డొమెస్టిక్, 200 మంది ఇంటర్నేషనల్ ప్రయాణికులకు ఏర్పాట్లు చేస్తామని, సివిల్ ఏవియేషన్ అనుమతి రాగానే రాకపోకలకు అనుమతి కల్పిస్తామన్నారు. వారణాసి, భువనేశ్వర్ మాదిరిగా ఏపీలో కూడా అంతర్జాతీయ విమానాల అనుసంధానానికి కృషి చేస్తామని అశోక్గజపతిరాజు చెప్పారు. దేశ వ్యాప్తంగా 32 ఎయిర్పోర్టులు నిరుపయోగంగా ఉన్నాయని, పాత టెర్మినల్స్లో కార్గో విమానాలకు అనుమతి కల్పించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







