ఆలు దోస బజ్జీలు
- August 02, 2017కావలసినవి: ఆలు 500 గ్రా., దోసకాయలు మీడియం సైజువి 2, మిరియాల పొడి 1/2 టీస్పూను, ఉప్పు తగినంత.
పూతపిండికి: శెనగపిండి 2 క ప్పులు, ఉల్లివిత్తనాలు ఒక టీ స్పూను, నూనె వేగించడానికి సరిపడా, ఉప్పు తగినంత.
తయారుచేసే విధానం
ఆలుగడ్డల్ని చెక్కుతీసి ఫోటోలో చూపిన విధంగా వెడల్పాటి ముక్కలుగా కోసిపెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టి ఉంచాలి. తర్వాత నీళ్ళు ఒడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో నీళ్ళు వేడిచేసి దానిలో ఈ ముక్కలువేసి సగం ఉడికీ ఉడక్క ముందే దించేయాలి. మూడు నాలుగు నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉంచొద్దు. మళ్ళీ నీళ్ళన్నీ ఒడకట్టి మిరియాల పొడి చల్లి పక్కన ఉంచేయాలి. దోసకాయల చెక్కుతీసి సన్నగా తురుముకుని చేతులతో ఒత్తి నీళ్ళన్నీ పిండేయాలి.
శెనగపిండి, ఉప్పు, ఉల్లివిత్తనాలను కొంచెం నీళ్ళతో బజ్జీల పిండిలా కలుపుకోవాలి. నురుగు వచ్చేదాకా దాన్ని గిలకొట్టి దోసగుజ్జుని దానిలో బాగా కలిపేయాలి. ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేడిచేయాలి. ఆలుముక్కల్ని ఈ పిండిలో ముంచి మీడియం సెగపెట్టి వేగించాలి. రెండు వేపులా బ్రౌన్రంగు వచ్చేదాకా వేగించి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..