యూపీలో డిగ్రీ చదివిన ముస్లిం యువతులకు సర్కార్ గిప్ట్

- August 08, 2017 , by Maagulf
యూపీలో డిగ్రీ చదివిన ముస్లిం యువతులకు సర్కార్ గిప్ట్

దేశంలో బాలికల చదువును ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రధాని నేతృత్వంలోని యూపీ సర్కార్ మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతోంది.  డిగ్రీ పూర్తిచేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ.50 వేలను అందించాలని నిర్ణయించింది.  మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ (ఎంఏఎఫ్ఈ) స్కాలర్ షిప్‌లను పొంది విద్యను అభ్యసిస్తున్న ప్రతి ముస్లిం బాలికా ఈ పథకానికి అర్హురాలని అధికారులు తెలిపారు.  కాగా ముస్లిం మహిళల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించే దిశగా 90 శాతానికి పైగా బాలికలకు ఈ సంస్థ ఆర్థిక సాయం అందిస్తోంది.  ప్రస్తుతం ఇంటర్ చదివే బాలికలకు రూ.12వేలు స్కాలర్ షిప్‌ని అందిస్తోంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com