'చాలా వేడి ' అధిక ఉష్ణోగ్రత వాతావరణం యుఎఇలో కొనసాగనుంది
- August 12, 2017
జాతీయ వాతావరణం విభాగం శనివారం నుంచి అధిక ఉష్ణోగ్రతలకి ఎక్కువగా ఉంటాయని అంచనా వేసింది - కొన్ని సమయాలలో మేఘాలతో ఆకాశం అలుముకొని మబ్బుగా ఉంటాయి. మేఘాల సంఖ్య క్రమేపీ పెరిగి తూర్పు మరియు దక్షిణ ప్రాంతాలపై వ్యాపిస్తాయని పేర్కొంది.మధ్యాహ్నం నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.మెరుపులతో కూడిన మితమైన గాలులు ఈ ప్రాంతాలలో చోటుచేసుకుంటూ, దుమ్ము మరియు ఇసుకను ఆయా ప్రాంతాలమీదకు వేయవచ్చు.కొన్ని తీరప్రాంత మరియు అంతర్గత ప్రాంతాల్లో. సాపేక్ష ఆర్ధ్రత పశ్చిమ తీరంలో, సాయంత్రం మరియు ఉదయం ప్రారంభమవుతుంది. పర్వతాలలో 25 డిగ్రీల సెల్సియస్ ఉంటె ద్వీపాలలో 49 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుందని అంచనాలను వేస్తున్నారు.. ఉత్తర- తూర్పు ల నుంచి గాలులు దక్షిణ తూర్పు వైపుగా 15 నుండి 30 కి.మీ. వేగంతో గాలులు వేయవచ్చు కొన్నిసార్లు ఆ గాలుల వేగం 40 కి.మీ. వరకు ఉండవచ్చు.ఆన్లైన్ లో ప్రపంచ వాతావరణ అంచనా ప్రకారం, అబుదాబి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు చేరుకుంటాయి, కాని ఆ ఉష్ణోగ్రత 48 డిగ్రీల లాగా భావిస్తారు. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు, 43 డిగ్రీల ఉష్ణోగ్రత కలిగివుంటాయి. వాతావరణం పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలకు చేరుకుంటుంది. రాత్రి సమయంలో ఆ ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ గా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









