కొత్త లగేజ్‌ రూల్‌: ప్రయాణీకులకు అవగాహన

- August 22, 2017 , by Maagulf
కొత్త లగేజ్‌ రూల్‌: ప్రయాణీకులకు అవగాహన

మస్కట్‌: ఒమన్‌లో ఎయిర్‌లైన్స్‌ అలాగే ట్రావెల్‌ ఆపరేటర్స్‌, న్యూ బ్యాగేజ్‌ రూల్‌ పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒమన్‌ ఎయిర్‌ పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఓఏఎంసి) ఈ కొత్త బ్యాగేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫాస్టర్‌ పికప్స్‌, బ్యాగేజ్‌ జామ్స్‌ని తగ్గించి ఇబ్బందుల్లేని ప్రయాణానుభూతిని కల్పించేందుకే ఈ కొత్త విధానమని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి మస్కట్‌, సోహార్‌ సలాలా ఎయిర్‌పోర్టుల్లో గుండ్రంగా, ఇర్రెగ్యులర్‌గా ఉన్న బ్యాగ్‌లు, బ్లాంకెట్స్‌తో చుట్టినవి, రోప్స్‌తో కట్టిన బ్యాగేజీలను చెక్‌ ఇన్‌లోకి అనుమతించరు. అల్‌ హసర్‌ ట్రావెల్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం మెహమూద్‌ మాట్లాడుతూ, ప్రయాణీకులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో కొత్త నిబంధనల్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఆకాష్‌ యాత్రా ఎండీ ఎమ్దాద్‌ బచ్చు మాట్లాడుతూ, కొత్త బ్యాగేజీ విధానంపై అప్రమత్తంగా ఉన్నామనీ, తమ ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించామని అన్నారు. ఎయిర్‌ ఇండియా, సోషల్‌ మీడియా వేదికగా కొత్త నిబంధనలపై ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com