కొత్త లగేజ్ రూల్: ప్రయాణీకులకు అవగాహన
- August 22, 2017
మస్కట్: ఒమన్లో ఎయిర్లైన్స్ అలాగే ట్రావెల్ ఆపరేటర్స్, న్యూ బ్యాగేజ్ రూల్ పట్ల అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఒమన్ ఎయిర్ పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (ఓఏఎంసి) ఈ కొత్త బ్యాగేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఫాస్టర్ పికప్స్, బ్యాగేజ్ జామ్స్ని తగ్గించి ఇబ్బందుల్లేని ప్రయాణానుభూతిని కల్పించేందుకే ఈ కొత్త విధానమని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 1 నుంచి మస్కట్, సోహార్ సలాలా ఎయిర్పోర్టుల్లో గుండ్రంగా, ఇర్రెగ్యులర్గా ఉన్న బ్యాగ్లు, బ్లాంకెట్స్తో చుట్టినవి, రోప్స్తో కట్టిన బ్యాగేజీలను చెక్ ఇన్లోకి అనుమతించరు. అల్ హసర్ ట్రావెల్స్ జనరల్ మేనేజర్ ఎం మెహమూద్ మాట్లాడుతూ, ప్రయాణీకులకు ఎస్ఎంఎస్ల రూపంలో కొత్త నిబంధనల్ని తెలియజేస్తున్నామని అన్నారు. ఆకాష్ యాత్రా ఎండీ ఎమ్దాద్ బచ్చు మాట్లాడుతూ, కొత్త బ్యాగేజీ విధానంపై అప్రమత్తంగా ఉన్నామనీ, తమ ప్రయాణీకులకు ఈ విషయమై అవగాహన కల్పించే చర్యలు ప్రారంభించామని అన్నారు. ఎయిర్ ఇండియా, సోషల్ మీడియా వేదికగా కొత్త నిబంధనలపై ప్రచారం చేస్తున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- తొలి 30 మిలియన్ దిర్హమ్ల విజేత వివరాలు వెల్లడించిన యూఏఈ లాటరీ..!!
- 'సాస్ ఫర్ ఎక్సలెన్స్' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ..!!
- సమ్మర్ లో వాహనాల్లో అగ్నిప్రమాద నివారణకు ఖతార్ రవాణా శాఖ సూచనలు..!!
- కువైట్ లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా ఫెస్టివల్..!!
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..









