హైదరాబాద్‌లో 200 వాటర్‌ ఏటీఎంలు

- August 26, 2017 , by Maagulf
హైదరాబాద్‌లో 200 వాటర్‌ ఏటీఎంలు

మేయర్‌ బొంతు రామ్మోహన్‌హైదరాబాద్‌: ఈ ఏడాది చివరి నాటికి హైదరాబాద్‌ నగరంలో 200 వాటర్‌ ఏటీఎంలు ఏర్పాటు చేస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ అన్నారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌ వద్ద ఏర్పాటు చేసిన వాటర్‌ ఏటీఎంను జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. వాటర్‌ ఏటీఎంను స్వీడన్‌ జోషెఫ్‌, నేచర్స్‌ స్ప్రింగ్‌ సంస్థలు ఏర్పాటు చేశాయి. జీహెచ్‌ఎంసీ, జలమండలి సహకారంతో ఇవి నడవనున్నాయి. ఈ ఏటీఎం ద్వారా రూ.1కి గ్లాసు, రూ.2కి లీటరు నీళ్లు, రూ.5కి 10 లీటర్లు, రూ.10కి 20 లీటర్ల నీళ్లు అందించనున్నారు. వాటర్‌ ఏటీఎం ఏర్పాటు సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర ప్రజలకు కాలుష్య రహిత మంచినీరు అందిస్తామని, అందరికీ సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించాలన్నదే లక్ష్యం అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com