ఏడుగురు తెలంగాణ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు

- September 05, 2017 , by Maagulf
ఏడుగురు తెలంగాణ ఉపాధ్యాయులకు జాతీయ అవార్డులు

తెలంగాణ నుంచి ఏడుగురు ఉపాధ్యాయులు ''నేషనల్‌ అవార్డ్స్‌ టూ టీచర్స్‌-2017''కు ఎంపికయ్యారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వారికి అవార్డులను అందజేశారు. ప్రాథమిక ఉపాధ్యాయులు కిషన్‌ (పాతఎల్లాపూర్‌, నిర్మల్‌), కె.జనార్దన్‌ (శివన్నగూడ, నల్గొండ), ఎం.నారాయణ (పల్కపల్లి, నాగర్‌కర్నూల్‌), ఎన్‌.విజయలక్ష్మి (కుల్సాపూర్‌, నిజామాబాద్‌)తోపాటు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు యోగేశ్వర్‌ (మంచిర్యాల), కె.సురేందర్‌ (జగిత్యాల), రామారావు (ఎన్కూరు, ఖమ్మం) అవార్డులను స్వీకరించారు. కేంద్ర మంత్రి ప్ర కాశ్‌ జవదేకర్‌, సహాయమంత్రులు సత్యపాల్‌సింగ్‌, ఉపేంద్ర కుశ్వాహా పాల్గొన్నారు. కాగా, అవార్డులు పొందిన వారు సాయంత్రం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com