ఫ్లోరిడాలోని వరద బీభత్సంతో ప్రజలు దోచుకుంటున్న దొంగలు
- September 11, 2017
అమెరికాలోని ఫ్లోరిడా, మయామిలో ఓ వైపు వరద బీభత్సంతో ప్రజలు అల్లాడిపోతుంటే.. మరోవైపు దొంగలు దొరికినకాడికి దోచుకుంటున్నారు. ప్రాణభయంతో వ్యాపారులు షాపులు వదిలేసి వలసవెళ్లారు. అయితే, రాకాసి గాలుల బీభత్సానికి కొన్ని షాపుల్లో అద్దాలు ధ్వంసమయ్యాయి. మరికొన్ని చోట్ల తలుపులు పగిలిపోయాయి. దీన్ని అదునుగా చేసుకున్న దుంగుడులు.. అందిన కాడికి దోచుకుంటున్నారు. పనికొస్తుందా.? పనికి రాదా? అనేది కూడా చూడకుండా చేతికి ఏది దొరికితే అది భుజాన పెట్టుకుని పారిపోతున్నారు. అయితే, దొంగలే కాదు.. కొందరు సాధారణ పౌరులు కూడా ఇలా లూటీలకు పాల్పడుతున్నట్టు కెమెరాల్లో రికార్డయింది. అయితే, దొంగతనం జరుగుతున్న విషయం తెలిసి పోలీసులు అలర్ట్ అవ్వడంతో వారంతా పారిపోయారు. అయితే, లూటీ చేసిన వారిని వెంటాడి పట్టుకున్నారు పోలీసులు.
ఇక భీకరమైన తుపాను ధాటికి.. నదులు, సరస్సుల్లో ఉండే మొసళ్లు ఊళ్ల మీదకు కొట్టుకొస్తున్నాయి. సొంత గూటికి వెళ్లే దారి తెలియక.. ఇళ్లలోకి చొరబడుతున్నాయి. రోడ్ల మీద ఇలాంటి దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







