వ్యభిచారం: ఐదుగురిపై ఆరోపణలు

- September 18, 2017 , by Maagulf
వ్యభిచారం: ఐదుగురిపై ఆరోపణలు

మనామా: మహిళా డొమెస్టిక్‌ వర్కర్స్‌ని చీటింగ్‌ చేసి, వారితో వ్యభిచారం చేయిస్తున్నారన్న ఆరోపణల మేరకు ఐదుగురు వ్యక్తులపై హ్యూమన్‌ ట్రాఫికింగ్‌, రేప్‌, కిడ్నాప్‌ నేరాలకు సంబంధించిన కేసుల్ని నమోదు చేశారు. డిప్యూటీ జనరల్‌ అటార్నీ - పబ్లిక్‌ రపాసిక్యూషన్‌ అబ్దుల్లా అల్‌ తవాది ఈ వివరాల్ని వెల్లడించారు. హై క్రిమినల్‌ కోర్టుకి ఐదుగురు నిందితుల్ని రిఫర్‌ చేసినట్లు తెలిపారాయన. హౌస్‌మెయిడ్స్‌గా పనిచేసేందుకు బహ్రెయిన్‌కి వచ్చామని బాధిత మహిళలు పోలీసుల విచారణలో వెల్లడించారు. నిందితులు తమను చీటింగ్‌ చేసి, దేశంలోని పలు అపార్ట్‌మెంట్లకు బలవంతంగా తరలించారనీ, అక్కడ తమపై అఘాయిత్యాలు జరిగాయని వాపోయారు. ఓ బాధిత మహిళ, ఓ అపార్ట్‌మెంట్‌ విండో నుంచి బయటకు దూకి తప్పించుకోవడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగు చూసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com