నిద్ర కరువైతే... సెల్ ఫోన్లు వాడితే.. కెలోరీలు ఖర్చు కావా?
- September 22, 2017నిద్ర కరువైతే బరువు పెరిగిపోతారని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట పది గంటలకల్లా నిద్రకు ఉపక్రమించి.. ఉదయం పూట ఆరు గంటలకు నిద్రలేవాలి. దాదాపు 8 గంటల పాటు నిద్రపోనట్లైతే.. శరీర బరువు అమాంతం పెరిగిపోవడం ఖాయమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
నిద్రలోపాల ద్వారా బరువు పెరగడమే కాకుండా అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. నిద్రలేమి ద్వారా శరీరం అలసటకు గురవుతుంది. అందుకే నిద్రించేందుకు అర గంట ముందు టీవీ లేదా మొబైళ్లను కట్టి పడేయాలి. సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్లు ఉపయోగించే వారు వాటిని దూరంగా ఉంచాలని పరిశోధనలో తేలింది.
చీకటిలో నిద్రించే వారితో పోలిస్తే, టీవీ, స్మార్ట్ ఫోన్, లాప్టాప్ వంటి కృత్రిమ వెలుగును అధిక సమయం వెచ్చించే వారిలో ఊబకాయం తప్పదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కృత్రిమ వెలుతురు కేలరీలను ఖర్చు చేసే బ్రౌన్ సెల్స్ను కూడా ప్రభావితపరుస్తాయట. తద్వారా కెలోరీలు ఖర్చు కాకుండా బరువు పెరిగిపోతారని, ఊబకాయంతో గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం వంటి ఇతరేతర వ్యాధులు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..