మయన్మార్ సరిహద్దు దగ్గర ఉన్న లెంఖు గ్రామంలోని సర్జికల్ స్ట్రైక్స్..!

- September 27, 2017 , by Maagulf
మయన్మార్ సరిహద్దు దగ్గర ఉన్న లెంఖు గ్రామంలోని సర్జికల్ స్ట్రైక్స్..!

గతేడాది పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ.. ఈసారీ మయన్మార్ సరిహద్దుల్లో అలాంటి ఆపరేషనే నిర్వహించింది. తరచూ సైన్యంపై కాల్పులు జరుపుతున్న నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మెరుపుదాడులు చేసింది. ఈ విషయాన్ని ఈస్టర్న్ కమాండ్ తమ అధికారిక ట్విట్టర్‌లో స్వయంగా వెల్లడించింది. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్టు చెప్పింది. 
బుధవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో సైన్యం ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో మొత్తం 70 మంది పారా కమెండోలు పాల్గొన్నారు. ఉదయం తిరుగుబాటు దారులు సైన్యంపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్‌ను నిర్వహించినట్లు ప్రకటించంది. ఈ ఆపరేషన్ కోసం అంతర్జాతీయ సరిహద్దులను దాటలేదని స్పష్టం చేసిన అధికారులు.. ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించారు. 
మయన్మార్‌ సరిహద్దు దగ్గర ఉన్న లెంఖు గ్రామంలోని NSCN(K) ఉగ్ర శిబిరాలపై దాదాపు ఈ దాడులు జరిగాయి. 2015 జూన్‌లో కూడా లక్ష్యంగా మయన్మార్‌ సహకారంతో ఇండియన్ ఆర్మీ సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది. అప్పట్లో సరిహద్దుల్లో ఉన్న సుమారు 50 పైగా క్యాంపులు ధ్వంసం చేసింది. నాగా ఉగ్రవాదులు మణిపూర్‌ లో 18 మందిని చంపడంతో ప్రతీకారంగా ఆర్మీ ఈ దాడులు జరిపింది. తాజాగా మరోసారి అదే తరహా దాడులు చేసింది. గత ఏడాది POKలో మెరుపుదాడులు చేసిన సైన్యం 4 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, దాదాపు 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com