మయన్మార్ సరిహద్దు దగ్గర ఉన్న లెంఖు గ్రామంలోని సర్జికల్ స్ట్రైక్స్..!
- September 27, 2017
గతేడాది పీఓకేలో సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడిన ఇండియన్ ఆర్మీ.. ఈసారీ మయన్మార్ సరిహద్దుల్లో అలాంటి ఆపరేషనే నిర్వహించింది. తరచూ సైన్యంపై కాల్పులు జరుపుతున్న నాగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మెరుపుదాడులు చేసింది. ఈ విషయాన్ని ఈస్టర్న్ కమాండ్ తమ అధికారిక ట్విట్టర్లో స్వయంగా వెల్లడించింది. ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులకు భారీ నష్టం జరిగినట్టు చెప్పింది.
బుధవారం తెల్లవారుజామున 4.45 గంటలకు ఇండో-మయన్మార్ సరిహద్దుల్లో సైన్యం ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో మొత్తం 70 మంది పారా కమెండోలు పాల్గొన్నారు. ఉదయం తిరుగుబాటు దారులు సైన్యంపై కాల్పులు జరపడంతో ఈ ఆపరేషన్ను నిర్వహించినట్లు ప్రకటించంది. ఈ ఆపరేషన్ కోసం అంతర్జాతీయ సరిహద్దులను దాటలేదని స్పష్టం చేసిన అధికారులు.. ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించారు.
మయన్మార్ సరిహద్దు దగ్గర ఉన్న లెంఖు గ్రామంలోని NSCN(K) ఉగ్ర శిబిరాలపై దాదాపు ఈ దాడులు జరిగాయి. 2015 జూన్లో కూడా లక్ష్యంగా మయన్మార్ సహకారంతో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అప్పట్లో సరిహద్దుల్లో ఉన్న సుమారు 50 పైగా క్యాంపులు ధ్వంసం చేసింది. నాగా ఉగ్రవాదులు మణిపూర్ లో 18 మందిని చంపడంతో ప్రతీకారంగా ఆర్మీ ఈ దాడులు జరిపింది. తాజాగా మరోసారి అదే తరహా దాడులు చేసింది. గత ఏడాది POKలో మెరుపుదాడులు చేసిన సైన్యం 4 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి, దాదాపు 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









