ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. రాత్రిపూట పెరుగు వేసుకోకూడదా?
- October 08, 2017మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు విటమిన్ ''సి'' ఉన్న సహజమైన ఆహారం తీసుకోవడం మంచిది. బత్తాయి, ద్రాక్ష, క్యాలీఫ్లవర్, నారింజ, నిమ్మ, మామిడి పళ్ళను తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అలాగే మెగ్నీషియం ఉన్న గోధుమలు, బాదం, పొద్దు తిరుగుడు విత్తనాలు, ఉదయం పూట పెరుగు, వెన్న, పాలు తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడిని పక్కనబెట్టవచ్చు.
కానీ రాత్రిపూట మాత్రం పెరుగు తీసుకుంటే ఒత్తిడి ఖాయం. మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా ఒత్తిడి దానిద్వారా ఏర్పడే అనారోగ్య రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. ఆయుర్వేదం ప్రకారం.. తీపిపదార్థాలు మితంగా, కొంచెం కారం, ఉప్పు వున్న వంటకాలు తీసుకోవడం మంచిది. రాత్రిపూట వేడి పాలు, పటికబెల్లం కలిపి తీసుకోవాలి. ప్రతిరోజూ పులుపు లేని తియన్ని పళ్ళ రసం తాగండి. అన్నింటికంటే ముందు రాత్రి పదిగంటలకల్లా నిద్రపోవడం మంచిది.
ఇక సైకలాజికల్ పరంగా ప్రణాళికతో జీవనం అలవాటు చేసుకోండి. ప్రతిరోజూ ఏదో ఒక మంచి భావాన్ని పెంటే పని చేయండి. తీరని సమస్యల గురించి ఆలోచించకుండా వెంటనే మరో వ్యాపకానికి మారిపోండి. యోగా చేయండి. ఒత్తిడికి కారణమయ్యే పనులను వరుస క్రమంలో పూర్తి చేయండి. మీలో ఆత్మవిశ్వాసాన్ని, మీ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్