సికింద్రాబాద్ స్టేష్న్ రాజధాని ఎక్స్ప్రెస్లో 4,532 కిలోల నగల స్వాధీనం
- October 15, 2017రసీదులు లేకుండానే ముంబయ్, కర్ణాటక, ఢిల్లీ తదితర నగరాలకు బంగారు నగలు రైళ్ల ద్వారా పెద్దమొత్తంలో సరఫరా అవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు రైలు సికింద్రాబాద్ స్టేష్న్కు చేరుకోగానే తనిఖీలు చేసి 4,532 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ అమృత్సర్కు చెందిన కన్నా రాజేష్(50), జగ్మోహన్ సింగ్(35) బంగారు వ్యాపారులు. ఢిల్లీ నుంచి అమృత్సర్కు ఈ ఏడాది సెప్టెంబర్ 8న బయల్దేరిన రాజధాని సూపర్పాస్ట్ ఎక్స్ప్రెస్ రైలులో ఎస్-5, 2ఏసీ బోగీలో ప్రయాణించారు.
10వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు రైలు సికింద్రాబాద్ చేరుకున్న తర్వాత ప్లాట్ ఫారం నెంబర్ పదిలో ఆగింది. అప్పటికే పోలీసులకు రైలులో బంగారం తరలిస్తున్నారని సమాచారం అందడంతో జీఆర్పీ ఎస్ఐలు ప్రమోద్కుమార్, నాగేశ్వర్రెడ్డి, ఎస్పీ ఎస్సై కృష్ణారావు, రైల్వే ఎస్బీ కానిస్టేబుల్ శంకర్తోపాటు ఐదు బృందాలు ఏసీ బోగీలో తనిఖీ చేశారు. బెర్తు 43, 45లో ఉన్న ఇద్దరికి సంబంధించిన బ్యాగుల్లో 4,532 కిలోల బంగారు నగలు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకుని ఇద్దరినీ రైల్వే పోలీస్టేషన్కు తీసుకొచ్చి విచారించారు. 1.9 కిలోల బంగారు ఆభరణాలకు మాత్రమే బిల్లులు ఉన్నాయి.
మిగతా వాటికి లేకపోవడంతో వారిపై కేసు నమోదు చేశారు.
తాజా వార్తలు
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక
- మధుమేహం ఉన్న పిల్లలకు గ్లూకోజ్ సెన్సార్లు, ఇన్సులిన్ పంపిణీ
- మే 24 - జూన్ 26 మధ్య హజ్ అనుమతి ఉంటేనే ఉమ్రా..!
- మద్యం, డ్రగ్స్ తో తొమ్మిది మంది అరెస్ట్