గోల్డెన్ గాళ్
- April 29, 2015
'కెరటం' చిత్రంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైనా...'వెంకటాద్రి ఎక్స్ప్రెస్' చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఆ తర్వాత వెంటవెంటనే 'లౌక్యం, కరెంటుతీగ' చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో రకుల్ గోల్డెన్ గాళ్గా మారింది. దీంతో యంగ్ హీరోల సరసన ఆఫర్లు కొట్టేసింది. 'రామ్ (పండగచేస్కో), రవితేజ (కిక్-2), రామ్ చరణ్, ఎన్టీఆర్ (మా నాన్నకు ప్రేమతో), మహేష్ (బ్రహ్మోత్సవం) వంటి స్టార్ హీరోల సరసన నటించేందుకు ఇప్పటికే కమిట్ అయ్యింది. తాజాగా మరో యంగ్ హీరోకు కథానాయికగా నటించే అవకాశం వచ్చిందట. నితిన్ మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడు చెప్పిన స్టొరీ లైన్ కి ఓకే చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నితిన్కి జోడీగా రకుల్ను ఎంపిక చేయాలని భావిస్తున్నారట. కొన్నాళ్ల క్రితం నితిన్ - శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్లో ఓ మూవీ మొదలయ్యి ఆగిపోయింది. ఆ సినిమాలో హీరోయిన్ గా రకుల్ని ఎంపిక చేసి నిర్మాతైన నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి ఆమెకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఆ సినిమా ఆగిపోవండంతో నితిన్ - వేణు సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్నే హీరోయిన్గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







