ఈ నెల 27న రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'
- October 23, 2017ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.
స్రవంతి రవికిషోర్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా లో రామ్ కి జోడీగీ క్యూటీ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. లవ్, ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి నేను శైలజ మూవీతో హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఈ మూవీతో డైరెక్టర్ కిషోర్ తిరుమలకి మంచి గుర్తింపు వచ్చింది. కిషోర్ మీద నమ్మకంతోనే రామ్ రెండో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ కాంబినేషన్లో వస్తుండటంతో ఉన్నది ఒక్కటే జిందగీపై ప్రేక్షకుల్లో ఏర్పడింది.
రామ్ ని ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో, స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆడియో ఫంక్షన్లో విడుదల చేసిన ధియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. రామ్ తో పాటు హీరోయిన్లు అనుపమ, లావణ్య కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటోంది టీమ్. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ఈ నెల 27న విడుదలవుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ