ఈ నెల 27న రామ్ 'ఉన్నది ఒకటే జిందగీ'
- October 23, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్ లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. నేను శైలజ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి డైరెక్టర్. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ ఏర్పడింది. సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది.
స్రవంతి రవికిషోర్ బ్యానర్లో తెరకెక్కిన ఈ సినిమా లో రామ్ కి జోడీగీ క్యూటీ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటించారు. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. లవ్, ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది.
ఫ్లాపుల్లో ఉన్న రామ్ కి నేను శైలజ మూవీతో హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కిషోర్ తిరుమల. ఈ మూవీతో డైరెక్టర్ కిషోర్ తిరుమలకి మంచి గుర్తింపు వచ్చింది. కిషోర్ మీద నమ్మకంతోనే రామ్ రెండో సినిమా ఛాన్స్ కూడా ఇచ్చాడు. ఈ కాంబినేషన్లో వస్తుండటంతో ఉన్నది ఒక్కటే జిందగీపై ప్రేక్షకుల్లో ఏర్పడింది.
రామ్ ని ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో, స్టైలిష్ గా ప్రజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్. దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాంగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆడియో ఫంక్షన్లో విడుదల చేసిన ధియేట్రికల్ ట్రైలర్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. రామ్ తో పాటు హీరోయిన్లు అనుపమ, లావణ్య కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారంటోంది టీమ్. సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ, ఈ నెల 27న విడుదలవుతోంది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









