రోబో 2.ఓ ఆడియో వేడుకకు ముఖ్య తిధిగా కమల్
- October 24, 2017రజని కాంత్ తాజా సినిమా 2.0 ఆడియో లాంచ్ డేట్ ఫిక్స్ అయినప్పటినుంచి ఈఫంక్షన్ కు చీఫ్ గెస్ట్ ఎవరు? ఐ సినిమాకు అర్నాల్డ్ స్క్వార్జ్ నెగ్గర్ ను తీసుకొచ్చిన శంకర్, ఈసినిమా ఆడియోకు ఎవరిని ఇన్వైట్ చేశాడని ప్రతీ ఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే శంకర్ ఈ 2.0ఫంక్షన్ కు రజనీ సన్నిహితుడు యూనివర్సల్ స్టార్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకొస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...
ఇండియన్ సినిమా మొత్తం ఈగర్ గా వెయిట్ చేస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ టు పాయింట్ ఓ. శంకర్-రజనీకాంత్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈసినిమా విజువల్ గ్రాండియర్ గా అదరగొడుతుందని, ఓ హాలివుడ్ మూవీ రేంజ్ లో సౌత్ ఇండియన్ సినిమా స్థాయి పెంచుతుందని కోలీవుడ్ మొత్తం కాన్ఫిడెంట్ గా ఉంది. దీనికితగ్గట్లుగానే శంకర్ కూడా ఈ సినిమాను లార్జ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నాడు. 2డి, 3డి రెండు వెర్షన్స్ లోనూ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు.
రజనీకాంత్, అక్షయ్ కుమార్, ఎమీ జాక్సన్ లీడ్ రోల్స్ చేస్తోన్న ఈసినిమాలో ఎమీ కూడా రోబోగానే కనిపించబోతోంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, మేకింగ్ వీడియోస్ ఈసినిమా ఓ రేంజ్ లో ఉండబోతున్నాయని హింట్స్ ఇచ్చాయి. ఎ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండడంతో, 2పాయింట్ ఓ ఆల్బమ్ మెస్మరైజింగ్ గా ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ బజ్ ను మరింత పెంచేలా రోబో-2 ఆడియోను ఈనెల27న దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు నిర్మాతలు.
2పాయింట్ ఓ సాంగ్స్ ను రెహ్మాన్ లైవ్ లో పెర్ఫామ్ చెయ్యబోతున్నాడు. ఈ ప్రస్టీజియస్ ఈవెంట్ కు కమల్ హాసన్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తున్నారట శంకర్ అండ్ టీం. కమల్, రజనీ మంచి స్నేహితులు కాబట్టి కమల్ కూడా ఈ ఈవెంట్ కు వెళ్తున్నాడట. ఇక 450కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మాణమైన ఈసినిమా 2018 జనవరి 25న రిలీజ్ కాబోతోంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ