ఇరాన్ తరపున గూఢచర్యం చేసిన ఐదుగురికి జీవిత ఖైదు

- November 06, 2015 , by Maagulf
ఇరాన్ తరపున గూఢచర్యం చేసిన ఐదుగురికి జీవిత ఖైదు

 

ఇరాన్ కార్యకర్తలతో కలసి, బహ్రైన్ లోని ఎ. టి. ఎం. లను పేల్చివేయడానికి కుట్ర పన్నిన ఐదుగురికి యావజ్జీవ 

కారాగార శిక్ష విధించబడింది. అహ్మద్ షరీఫ్ (20), అలీ అబ్దుల్ హుస్సేన్ (22) అనే ఇద్దరు ఇరాన్ కు వెళ్లి, 'ఇరాన్ 

రివోల్యుషనరి గార్డ్ కాంప్' లో ఆయుధాలు మరియు  మందుగుండు శిక్షణ పొందిన అనంతరం బహ్రైన్ కు తిరిగి వచ్చి, సాదిక్ ఇబ్రహీం అల్ హయికీ, జస్సిం అహ్మద్ అబ్దుల్లా మరియు ఫదేల్ అబ్బాస్ లతో కలసి నేషనల్ బ్యాంకు ఆఫ్ బహ్రైన్ యొక్క ఎ. టి. ఎం.  మిషన్ల వద్ద బాంబులు అమర్చడానికి పన్నాగం పన్నారు. అంటే కాకుండా బహ్రైనీ 

టీనేజర్లకు మిలీషియా శిక్షణ ఇవ్వడానికి కూడా వీరే బాధ్యులు. ఈ ఐదుగురికి - విదేశాలతో కలసి కుట్ర పన్నినందుకు, విదేశంలో మిలీషియా శిక్షణ పొందినందుకు, తీవ్రవాద దళంలో సభ్యులైనందుకు ఈ శిక్ష విధించినట్టు నేడు కోర్టువారు తీర్పు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com