తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా'
- October 26, 2017సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి రోబో సీక్వెల్ 2.0. శంకర్ దర్శకత్వంలో రూ.400ల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్. ఆల్ రెడీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే జనవరి 26న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు.
రోబో సీక్వెల్ కంప్లీట్ అవ్వకముందే రజనీకాంత్ మరో చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. ఆ సినిమానే 'కాలా'. ధనుష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'కబాలి'. ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీంతో ఈ సారి కసితో ఈ సినిమా చేస్తోంది టీమ్.
'కాలా' మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ముంబయ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ సాగుతుంది. అణచివేతకు గురైన తమిళుల తరపున పోరాడే వ్యక్తిగా రజనీకాంత్ ఇందులో కనిపించబోతున్నారు. ఇందులో రాజకీయ కోణం కూడా ఉంటుందంటున్నారు. ధనుష్ ఈ చిత్రంపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. సినిమాని వచ్చే సమ్మర్లో ఏప్రిల్ 28న విడుదల చేయబోతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల