100వ ఎ380 ఎయిర్క్రాఫ్ట్కి ఎమిరేట్స్ స్వాగతం
- November 03, 2017శుక్రవారం ఎయిర్బస్ ఎ-380 వందవ విమానం డెలివరీ సందర్భంగా ఎమిరేట్స్ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించింది. యూఏఈ తొలి ప్రధాని, ఫాదర్ ఆఫ్ నేషన్ షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్కి ట్రిబ్యూట్గా ఈ 100వ విమానాన్ని డెలివరీ చేశారు. హంబర్గ్లోని డెలివరీ సెంటర్లోనూ ప్రత్యేకంగా వేడుకల్ని నిర్వహించడం జరిగింది. ఎయిర్బస్ డెలివరీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ డిస్కషన్లో ఎమిరేట్స్ ఛైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్ మాట్లాడుతూ, ఎ-380 100వ విమానంపై ఫొటోకి సంబంధించి యూఏఈ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అలాగే దుబాయ్ రూలర్ అయిన షేక్ మొహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సెలక్ట్ చేశారని అన్నారు. 2018వ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ జాయెద్గా ఇప్పటికే ప్రకటించారు. 2018లో జాయెద్ 100వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఎ-380 అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన విమానం. ఈ విమాన ప్రయాణం ప్రయాణీకులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!