విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకూ భారతీయులు భవిష్యనిధి

- November 03, 2017 , by Maagulf
విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకూ భారతీయులు భవిష్యనిధి

విదేశాల్లో పనిచేసే భారతీయులు కూడా ఇకపై ఉద్యోగుల భవిష్యనిధి ప్రయోజనాన్ని పొందవచ్చని కేంద్ర భవిష్యనిధి కమిషనర్‌ వీపీ జోయ్‌ శుక్రవారం వెల్లడించారు. 'మోసాలతో జరిగే నష్టాలను నివారించే మార్గాల'పై దిల్లీలో ఏర్పాటుచేసిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సౌకర్యాన్ని పొందేందుకు అంతర్జాలంలో (ఆన్‌లైన్‌) ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అయితే వారు పనిచేస్తున్న దేశంలో ఇలాంటి పథకం లేకపోతేనే ఇది వర్తిస్తుందని తెలిపారు. భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) జర్మనీ, ఆస్ట్రేలియా, జపాన్‌, సహా 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. సంబంధిత ఉద్యోగులకు అన్నివిధాలుగా అనుకూలంగా ఉండేలా ఈ విధానాన్ని రూపొందించినట్లు జోయ్‌ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com