మెగా హీరోలు లతో ఫైటింగ్ సై అంటోన్న బెల్లంకొండ శ్రీను
- November 05, 2017టాలీవుడ్ లో ఇప్పుడు ఫ్రెండ్లీ అట్మాసిఫియర్ కనిపిస్తుంది. టాప్ హీరోలు, స్టార్ మేకర్స్ ఎవరిమానాన వాళ్లు, ఎవరితో ఫైటింగ్ కు దిగకుండా కామ్ గా వెళ్లిపోతున్నారు. అయితే భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఓ ముగ్గురు యంగ్ స్టర్స్ మాత్రం గొడవలకు ప్లాట్ ఫామ్ గా మారుతున్నారు. ఫ్రెండ్లీ అట్మాసిపియర్ తో సంబంధం లేకుండా ఫైటింగ్స్ కు దిగుతున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి మహేశ్ బాబు వరకు అంతా పోటీ లేకుండా తమసినిమాలను రిలీజ్ చేసుకుంటున్నారు. వేరే సినిమాలతో క్లాష్ కాకుండా రిలీజ్ డేట్స్ కన్ఫామ్ చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం ఈ వాతావరణానికి భిన్నంగా వెళ్తున్నారు. ముగ్గురూ తమ సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేస్తూ స్ట్రయిట్ ఫైటింగ్ కు దిగుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ ప్రజెంట్ జవాన్ సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నాడు. అలాగే వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా కూడా చేస్తున్నాడు. ఈసినిమాను ఫిబ్రవరి9కు రిలీజ్ చెయ్యాలనుకుంటోంది యూనిట్. ఇక వరుణ్ తేజ్-రాశి ఖన్నా కాంబినేషన్లో రూపొందుతోన్న తొలిప్రేమ సినిమా కూడా ఫిబ్రవరి9కే రాబోతోంది. అంటే ఇద్దరు మెగాకుర్రాళ్లు ఒకేరోజు బరిలో దిగుతూ ఫేస్ టు ఫేస్ ఫైట్ చెయ్యబోతున్నారు.
ఈ ఇద్దరితో పాటు బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ ల సాక్ష్యం సినిమా కూడా ఫిబ్రవరి9కే రాబోతోంది. సో ఈ ముగ్గురి మధ్య ఫ్రైడే వార్ జరుగబోతోంది. అయితే ఇద్దరు మెగాహీరోలు ఫేస్ టు ఫేస్ ఫైట్ చేస్తే వాళ్ల సినిమాలకు ఓపెనింగ్స్ డివైడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ మెగాక్లాష్ ఛేంజ్ అవుతుందనే టాక్ వస్తోంది. ఒకవేళ ఇద్దరూ బరిలో నిలిస్తే ఎవరికి ఎక్కువ క్రేజ్ ఉందనేది కూడా తేలుతుందనేది ట్రేడ్ టాక్.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు