సౌదీ కింగ్ మరో కీలక నిర్ణయం
- November 09, 2017
సౌదీ కింగ్ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం సౌదీ కింగ్ కొత్తగా 30 మంది జడ్జీలను నియమించడంతో పాటు 26 మందిని ప్రమోట్ చేసినట్టు సౌదీ అరేబియా స్టేట్ న్యూస్ ఏజెన్సీ ఎస్పీఏ రిపోర్టు చేసింది. అవినీతి కేసులో 11 మంది యువరాజులను, నలుగురు మంత్రులను, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ నియామకం, ప్రమోషన్లు చర్చనీయాంశమైంది. సల్మాన్ ఆదేశాలతోనే వీరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్, లంచం, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దోచుకోవడం, దోపిడీ చేయడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి.
26 మంది జడ్జీలను ప్రమోట్ చేస్తున్నట్టు మరో 30 మందిని జ్యుడీషియరీలో వివిధ స్థానాల్లో నియమిస్తున్నట్టు సౌదీ రాజు రాయల్ ఆర్డర్ జారీచేశారు. అదుపులోకి తీసుకున్న వారి బ్యాంకుల సమాచారం అందించాలని యునిటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని రెగ్యులేటర్స్ ఇప్పటికే ఆదేశించాయి. వీలైతే వీరి అకౌంట్లను కూడా ఫ్రీజ్ చేయాలని పేర్కొన్నాయి. సెంట్రల్ బ్యాంకు ఆదేశాల మేరకు 1700 దేశీయ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేశామని బ్యాంకింగ్ వర్గాలు చెప్పాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..
- వర్షాకాలంలో నీటి నిల్వలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ముందస్తు చర్యలు









