పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం - నితిన్ గడ్కరీ

- November 09, 2017 , by Maagulf
పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం - నితిన్ గడ్కరీ

ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ఏపీ బీజేపీ నేతలు కలిశారు. గడ్కరీని కలిసిన వారిలో ఏపీ బీజేపీ నేతలు పురందేశ్వరి, కన్నా లక్ష్మినారాయణ, రఘు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తిచేస్తామని ఏపీనేతలకు గడ్కరీ చెప్పారు. జలవనరుల మంత్రిగా బాధ్యతలు తీసుకోగానే పోలవరాన్ని సందర్శించానన్నారు. పోలవరంపై ఎవరికీ ఎలాంటి అపోహలు వద్దని ఆయన పేర్కొన్నారు. పోలవరాన్ని పూర్తిచేసే బాధ్యత కేంద్రానిదేనన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com