55 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్
- November 12, 2017భారత్కు చెందిన 55 మంది జాలర్లను పాక్ అదుపులోకి తీసుకుంది. ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలు పడుతున్నారంటూ వారిని ఆ దేశ తీర ప్రాంత గస్తీదళాలు అదుపులోకి తీసుకున్నాయి. జాలర్లకు చెందిన 9 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని పోలీసులకు అప్పగించామని, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు వారిని హాజరు పరచనున్నామని తెలిపారు. అరేబియా సముద్రంలో చేపలు వేటాడే సమయంలో ఇలా ఇరు దేశాలకు చెందిన జాలర్లు గస్తీ సిబ్బందికి చిక్కడం తరచూ జరుగుతుంటుంది. ప్రాదేశిక జలాలకు సంబంధించి సరైన విభజన లేకపోవడం, జాలర్లు సాంకేతికతను ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. గత నెల 29న 68మంది భారత జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 2016 నుంచి జనవరి 2017 మధ్య మొత్తం 438 మంది జాలర్లకు పాక్ విముక్తి కలిగించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా