55 మంది భారత జాలర్లను అరెస్ట్ చేసిన పాక్
- November 12, 2017
భారత్కు చెందిన 55 మంది జాలర్లను పాక్ అదుపులోకి తీసుకుంది. ఆ దేశ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించి చేపలు పడుతున్నారంటూ వారిని ఆ దేశ తీర ప్రాంత గస్తీదళాలు అదుపులోకి తీసుకున్నాయి. జాలర్లకు చెందిన 9 పడవలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని పోలీసులకు అప్పగించామని, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు వారిని హాజరు పరచనున్నామని తెలిపారు. అరేబియా సముద్రంలో చేపలు వేటాడే సమయంలో ఇలా ఇరు దేశాలకు చెందిన జాలర్లు గస్తీ సిబ్బందికి చిక్కడం తరచూ జరుగుతుంటుంది. ప్రాదేశిక జలాలకు సంబంధించి సరైన విభజన లేకపోవడం, జాలర్లు సాంకేతికతను ఉపయోగించకపోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. గత నెల 29న 68మంది భారత జాలర్లను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. డిసెంబర్ 2016 నుంచి జనవరి 2017 మధ్య మొత్తం 438 మంది జాలర్లకు పాక్ విముక్తి కలిగించింది.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







