అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య.!
- November 12, 2017అకారణంగా ఓ వ్యక్తి జరిపిన కాల్పుల కారణంగా భారత సంతతికి చెందిన 40ఏళ్ల ఆకాశ్ ఆర్ తలాటి ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఉత్తరకరోలినాలో ఆకాశ్కు నైట్స్ ఇన్ అండ్ డైమండ్స్ జెంటిల్మన్ క్లబ్ ఉంది. ఆ క్లబ్కు మార్కెసీ దెవిట్(23) అనే వ్యక్తి వచ్చాడు. క్లబ్లో దెవిట్ గందరగోళం సృష్టించడంతో భద్రతా సిబ్బంది అతడిని బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో కోపంతో వూగిపోయిన దెవిట్ తన కారు దగ్గరికి వెళ్లి తుపాకీ తీసుకొచ్చి భదత్రా సిబ్బందిపై కాల్పులు జరిపాడు.
అదే సమయంలో ఆకాశ్ రావడంతో అతడికి బుల్లెట్లు తగిలాయి. ఈ ప్రమాదంలో మరో నలుగురు గాయపడ్డారు. కాగా.. తీవ్ర బుల్లెట్ గాయాల పాలైన ఆకాశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కాల్పులు జరిపిన దెవిట్ను అరెస్టు చేశారు. ఆకాశ్ గుజరాత్వాసిగా అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారత విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. 'ఆకాశ్ హత్యకు సంబంధించిన విషయాలను అమెరికాలోని భారత దౌత్యకార్యాలయ అధికారులు సమాచారం అందించారు. వాళ్ల కుటుంబసభ్యులతో మాట్లాడాం. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాం' అని సుష్మా ఆదివారం ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి