ఇరాక్లో భూకంపం... 7.3 తీవ్రత...భారీ ప్రాణ నష్టం
- November 12, 2017బాగ్దాద్: ఇరాక్లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లలోని జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదికి పరుగులు తీశారు. ఆదివారం అర్థరాత్రి వచ్చిన భూకంపం థాటికి 150 మంది మృతి చెందారు. వేలాది మందికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైందని అమెరికా భూభౌతిక సర్వే(యూఎస్జీఎస్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాబా పట్టణానికి 32 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. 14 రాష్ట్రాలపై భూకంప ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కువైట్, యూఏఈ లోనూ ఆదివారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది.. అయితే ఇక్కడ ప్రాణ, ఆస్తి నష్టం ఎంత వాటిల్లిందన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక