ఇరాక్లో భూకంపం... 7.3 తీవ్రత...భారీ ప్రాణ నష్టం
- November 12, 2017బాగ్దాద్: ఇరాక్లో భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూకంపం రావడంతో ఇళ్లలోని జనాలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్డు మీదికి పరుగులు తీశారు. ఆదివారం అర్థరాత్రి వచ్చిన భూకంపం థాటికి 150 మంది మృతి చెందారు. వేలాది మందికి గాయాలయ్యాయి. అత్యవసర చికిత్సకై క్షతగాత్రులను వివిధ ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని తెలుస్తోంది.
రిక్టర్ స్కేల్పై 7.3 తీవ్రత నమోదైందని అమెరికా భూభౌతిక సర్వే(యూఎస్జీఎస్) సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అలాబా పట్టణానికి 32 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సంబంధిత అధికారులు గుర్తించారు. 14 రాష్ట్రాలపై భూకంప ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. మరోవైపు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు కువైట్, యూఏఈ లోనూ ఆదివారం అర్ధరాత్రి భూకంపం వచ్చింది.. అయితే ఇక్కడ ప్రాణ, ఆస్తి నష్టం ఎంత వాటిల్లిందన్న విషయం తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల