మొబైల్ బ్యాటరీ స్థానంలో బంగారం స్మగ్గ్లింగ్

- November 21, 2017 , by Maagulf
మొబైల్ బ్యాటరీ స్థానంలో బంగారం స్మగ్గ్లింగ్

హైదరాబాద్‌:విదేశాల నుంచి సరుకును తీసుకువచ్చి అధికారుల కళ్లుగప్పేందుకు వాళ్లు చేసే ప్రయత్నాలకు కస్టమ్స్ అధికారులే ఆశ్చర్యపోతుంటారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జరిగిన ఓ ఘటన అధికారులను అవాక్కయ్యేలా చేసింది.
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్‌ అధికారులు రూ.6 లక్షలు విలువచేసే బంగారాన్ని పట్టుకున్నారు. మస్కట్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద దీనిని స్వాధీనం చేసుకున్నారు. మొబైల్‌ ఫోన్‌లో బ్యాటరీ ఉండాల్సిన స్థానంలో బంగారాన్ని పెట్టి తీసుకొస్తుండగా అధికారులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com