ఇవాంకా సదస్సులో ప్రసంగించనున్న చెర్రీ
- November 25, 2017హైదరాబాద్: సినీ నటుడు రాంచరణ్ అరుదైన అవకాశం దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో రాంచరణ్ ప్రసంగించనున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఇవాంక ట్రంప్ రానుంది. ఈ సందర్భంగా ఆమె ఈ సదస్సునుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాంకతో పాటుగా ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్, సానియామీర్జా, గోపీచంద్, మిథాలీరాజ్, గవాస్కర్, మానుషి చిల్లర్, సోనమ్ కపూర్, అదితిరావులు ఈ సదస్సులో తమ సందేశాలివ్వనున్నారు.
ప్రప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుతో తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ పెట్టుబడుల విషయంలో మరింత ప్రాధాన్యం లభిస్తుందని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ అన్నారు. ''పెట్టుబడుల విషయంలో ఇతర మెట్రో నగరాల ఏకఛత్రాధిపత్యానికి గండిపడి భారీస్థాయి పెట్టుబడిదారులు హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడి వాళ్లకు కూడా అంతర్జాతీయ ధోరణులు అర్థం చేసుకొనే అవకాశం ఏర్పడుతుంది'' అని మీడియాతో జయేశ్రంజన్ చెప్పిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!