హైదరాబాద్లో ఇవాంకా..గ్రాండ్ వెల్కమ్
- November 27, 2017అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్హౌస్ సలహాదారు ఇవాంకా హైదరాబాద్కి చేరుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకి చేరుకున్న ఆమెకు తెలంగాణ మంత్రులు ఘన స్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి ప్రత్యేక వాహనంలో మాదాపూర్లోని ట్రైడెంట్ హోటల్కు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకు అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మూడు గంటలకు హెచ్ఐసీసీకి చేరుకుని కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్తో భేటీకానున్నారు.
అలాగే ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం హెచ్ఐసీసీ వేదిక వద్దకు చేరుకుంటారు.
అక్కడ మోదీని ఇవాంక మర్యాదపూర్వకంగా కలుస్తారు. పారిశ్రామికవేత్తల సదస్సు తర్వాత ఇద్దరూ కలిసి ఫలక్నుమా ప్యాలెస్ చేరుకుంటారు. విందు అనంతరం రాత్రి 10.45 గంటలకు ఇవాంకా తిరిగి ట్రైడెంట్ హోటల్కు చేరుకుంటారు. ఇవాంకా రాక సందర్భంగా హైటెక్ సిటీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వారాంతంలో మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్ఫారమ్ ప్రారంభం
- దుబాయ్లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ