హాస్టల్ విద్యార్థులు ప్రతీరోజూ జాతీయగీతం పాడాల్సిందే
- November 27, 2017
జైపూర్ : ప్రభుత్వ హాస్టళ్లలోని విద్యార్థులు ప్రతీరోజూ ఉదయం ఏడు గంటలకు జాతీయ గీతాన్ని పాడాలని రాజస్థాన్ రాష్ట్ర సర్కారు ఆదేశాలు జారీ చేసింది. రాజస్థాన్ రాష్ట్రంలోని 800 ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో ఉంటున్న 40వేల మంది విద్యార్థులు ప్రతీరోజూ ఉదయాన్నే ఏడు గంటలకు జాతీయ గీతాన్ని తప్పనిసరిగా పాడాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సమీత్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించేందుకే ఉదయం జాతీయగీతాన్ని ఆలపించాలని ఆదేశించినట్లు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరారాజే చెప్పారు. గతంలో పాఠశాలల్లో విద్యార్థులందరూ సూర్యనమస్కారాలు తప్పనిసరిగా చేయాలని వసుంధరా రాజే సర్కారు ఆదేశించింది. ఈ ఆదేశాలపై కొందరు కోర్టుకెళ్లగా దాన్ని విద్యార్థుల ఐచ్ఛికానికి వదిలివేసింది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







