ప్రపంచ తెలుగు మహాసభలు-2017...దుబాయ్ లో సన్నాహక సమావేశాలు
- December 03, 2017తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిస్టాత్మకంగా నిర్వహించబోతున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి యు.ఎ.ఇ. లో నివసిస్తున్న తెలుగు భాషా వికాసానికై పనిచేస్తున్న కవులను,రచయితలను, ఎన్.ఆర్.ఐ లను, వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులను ఆహ్వానించడానికి ETCA-Telangana Jagruthi ఆధ్వర్యంలో ఒక సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులు గా విచ్చేసిన మానకొండూరు శాసన సభ్యులు మరియు తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ గారు తెలుగు వారందరినీ కలిసి, తెలుగు మహాసభల యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను, తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు భాష గొప్పతనాన్ని వివరిస్తూ ఎన్.ఆర్.ఐ లందరూ తెలుగు మహాసభల్లో బాగస్వాములై కార్యక్రమాలని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.
ఈ సందర్బంగా తెలంగాణ, ఆంధ్రప్రదేష్ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులు, వక్తలు, రచయితలు, విధ్యావెత్తలు, కళాకారులు, సంఘాల ప్రతినిధులు హజరు అయ్యారు మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు.
తెలంగాణ గల్ఫ్ బిడ్డలందరూ ఏన్నో ఏళ్లు గా ఎదిరి చూస్తున్న TNRI పాలసీ ని ప్రకటించవలసింది గా NRI మంత్రి KTR గారిని, CM KCR గారిని కోరుతూ TNRI పాలసీ వినతి పత్రాలను శాసన సభ్యులు రసమయి బాలకిషన్ గారికి ఇవ్వడం జరిగింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక