నన్నపనేని: శైలజకు అండగా ఉంటాం
- December 04, 2017
తిరుపతి: తొలిరాత్రి భర్త చేతిలో తీవ్ర చిత్రహింసలకు గురై తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శైలజను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సోమవారం పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. అనంతరం రాజకుమారి మాట్లాడుతూ.. శైలజపై కిరాతకంగా దాడికి పాల్పడిన ఆమె భర్త రాజేష్పై కఠినచర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి శైలజ భర్త, మామపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక