లండన్లో సందడి చేస్తున్న ఎలక్ట్రిక్ ‘బ్లాక్ క్యాబ్స్’
- December 05, 2017
లండన్: లండన్లో ప్రముఖ క్యాబ్ సంస్థ ‘బ్లాక్ క్యాబ్స్’ తన వాహనాలను డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకుంటోంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రిక్ కార్లు మంగళవారం లండన్ రోడ్డెక్కాయి. నగరంలో కాలుష్యం పెరుగుతున్నందున ప్రభుత్వం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగానే ఈ మార్పులు చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. తన వాహన శ్రేణిలోని దాదాపు సగం డీజిల్ వాహనాలను (9వేలకు పైగా) 2021 నాటికి విద్యుత్తో నడిచే కార్లుగా మారుస్తున్నట్లు వెల్లడించింది. ‘ఈ వాహనాల్లోని అన్ని ఫీచర్లూ కొత్తగా ఉన్నాయి. ప్రయాణికులకు, క్యాబ్ డ్రైవర్కూ సౌకర్యవంతంగా ఉండనున్నాయి’ అని లండన్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ సీఈవో క్రిస్ గబ్బే తెలిపారు. ఆరుగురు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలుగా, వైఫై, యూఎస్బీ చార్జర్లు, ప్లగ్ సాకెట్ వంటి వివిధ వసతులు ఈ కార్లో ఉండనున్నాయి.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక