ఇరాన్ కు చెందిన పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న110 కిలోల హషీష్ స్వాధీనం
- December 06, 2017
కువైట్: ఇస్తాంబుల్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో అంతర్గత వ్యవహారాల శాఖ అధికారులు ఇరాన్ నుంచి పడవ ద్వారా అక్రమ రవాణా కాబడుతున్న 110 కిలోల హుషీష్ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొన్నారు. ఈ తనిఖీలో ఇరువురు కువైటీయులు మరియు ఐదుగురు ఇరానియన్లను రెడ్ హ్యాండడ్ గా అరెస్ట్ చేశారు. నేర చరిత్ర ఉన్న ఓ 42 ఏళ్ల కువైట్ దేశీయుడు దేశంలోకి 110 కిలోల హషీష్ ను అక్రమ రవాణా చేయాలని ప్రణాళిక రచించాడు. ఆ అనుమానితుడిని పోలీసుల నిఘాలో ఉండటంతో . నార్కోటిక్స్ డిటెక్టివ్ లు మంగళవారం ఆ నిందితుడిని అనుసరిస్తూ వెళ్లారు. ఫింటాస్ నుండి ఒక పడవలో సముద్రంలోకి వెళ్లారు, అతనితో పాటు మరొక కువైట్ సహచరుడితో వెళ్ళాడు. వీరి రాక కోసం ఎదురు చూస్తున్న ఐదుగురు ఇరానియన్లు వారికి పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాన్ని అందచేస్తున్న సమయంలో తనిఖీ అధికారులు వీరి వ్యవహారాన్ని అడ్డుకొని వారి రెండు పడవలతో పాటు ఏడుగురు నిందితులను 110 కిలోల హషిష్ స్వాధీనం చేసుకొన్నారు.
తాజా వార్తలు
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!







