నేపాల్ లో భూకంపం...
- December 08, 2017
కాఠ్మండూ: నేపాల్ దొలాఖా జిల్లాలో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం ఆ ప్రాంత వాసులను వణికించింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్పై 5.2 పాయింట్ల తీవ్రతను నమోదు చేసినట్లు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. ఈ ప్రకంపనల కేంద్రం దొలాఖా జిల్లాలోని జిరి వద్ద 27.68 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.19 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య భూగర్భంలో 10 కి.మీ లోతులో వున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రకంపనల ప్రభావం రాజధాని ఖాట్మండులో కూడా కన్పించింది. 2015 ఏప్రిల్ 25న నేపాల్లో దాదాపు 9 వేల మందికి పైగా ప్రజలను బలి తీసుకున్న పెను భూకంపం తరువాత వివిధ ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







