నేపాల్ లో భూకంపం...
- December 08, 2017కాఠ్మండూ: నేపాల్ దొలాఖా జిల్లాలో శుక్రవారం ఉదయం సంభవించిన భూకంపం ఆ ప్రాంత వాసులను వణికించింది. శుక్రవారం ఉదయం 8.30 గంటల సమయంలో సంభవించిన ఈ ప్రకంపనలు రిక్టర్ స్కేల్పై 5.2 పాయింట్ల తీవ్రతను నమోదు చేసినట్లు జాతీయ భూభౌతిక పరిశోధనా సంస్థ ఒక ప్రకటనలో వివరించింది. ఈ ప్రకంపనల కేంద్రం దొలాఖా జిల్లాలోని జిరి వద్ద 27.68 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 86.19 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య భూగర్భంలో 10 కి.మీ లోతులో వున్నట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ప్రకంపనల ప్రభావం రాజధాని ఖాట్మండులో కూడా కన్పించింది. 2015 ఏప్రిల్ 25న నేపాల్లో దాదాపు 9 వేల మందికి పైగా ప్రజలను బలి తీసుకున్న పెను భూకంపం తరువాత వివిధ ప్రాంతాల్లో పలుమార్లు భూమి కంపించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ