భారత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న చైనా మీడియా
- December 09, 2017_1512818762.jpg)
చైనా భూభాగంలోకి అక్రమంగా డ్రోన్ను ప్రవేశపెట్టినందుకు భారత్ క్షమాపణలు చెప్పాలని చైనా మీడియా కోరుతోంది. చైనాలోకి అక్రమంగా ప్రవేశించిన భారత డ్రోన్ను కూల్చేసినట్టు చైనా ఆర్మీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ను భారత్ కావాలనే వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి పంపించిందని చైనా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో సిక్కిం సెక్టార్లోని డోక్లాం ప్రాంతంలో చైనా, భారత్ మధ్య రహదారి విషయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతంలోకి భారత్ మానవ రహిత డ్రోన్ను పంపించింది. చాలా సున్నితమైన ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు దిగకూడదని ఇరు దేశాలూ గతంలోనే ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్ ఆ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఇందుకు భారత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని 'గ్లోబల్ టైమ్స్' రాసింది. సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్ అక్కడకు వచ్చిందని భారత్ చెబుతుండడం పూర్తిగా అబద్ధమని ఆరోపించింది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక