కేసీఆర్: జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతలకు సత్కారం
- December 11, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రపంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా జరగాలని, సాహిత్య, భాష ప్రాధాన్యంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులపాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ ఛైర్మన్, ఇతర నిర్వాహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ భారతీయ భాషల్లో రచనలు చేసి జ్ఞానపీఠ్ అవార్డులను పొందిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







