కేసీఆర్: జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీతలకు సత్కారం
- December 11, 2017
హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రపంచ తెలుగు మహాసభలు పేరుకు అనుగుణంగా జరగాలని, సాహిత్య, భాష ప్రాధాన్యంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్లోని ఎల్బీస్టేడియం ప్రాంగణంలో సభలు జరిగే ఐదు రోజులపాటు సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా ఉండాలని ఆదేశించారు. ఎక్కడా లోటు రాకుండా జాగ్రత్త పడాలని అన్నారు. ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వస్తారని తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య అకాడమీ ఛైర్మన్, ఇతర నిర్వాహకుల నుంచి సమావేశాల సన్నాహక కార్యక్రమాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. వివిధ భారతీయ భాషల్లో రచనలు చేసి జ్ఞానపీఠ్ అవార్డులను పొందిన వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి సత్కరించాలని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల