14న టీఆర్ఎస్‌లో చేరనున్న మాజీ మంత్రి ఉమా

- December 12, 2017 , by Maagulf
14న టీఆర్ఎస్‌లో చేరనున్న మాజీ మంత్రి ఉమా

మాజీ మంత్రి, తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలకంగా ఉన్న ఉమా మాధవరెడ్డి, ఆమె కుమారుడు సందీప్‌రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. వారు ఈనెల 14వతేదీన టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. ఈమేరకు మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. కాగా... తెలుగుదేశం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా ఉన్న ఉమా మాధవరెడ్డి... టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారనే ఊహగానాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ ఊహాగానాలను నిజం చేస్తూ 14వతేదీన తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. టీ టీడీపీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి టీడీపీ నుంచి అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ పార్టీల్లోకి వలసలు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com