మోహన్‌బాబు సెట్స్‌లో బాలకృష్ణ సందడి

- December 13, 2017 , by Maagulf
మోహన్‌బాబు సెట్స్‌లో బాలకృష్ణ సందడి

మోహన్‌బాబు- విష్ణు- శ్రియ కాంబినేషన్‌లో రానున్న మూవీ గాయత్రి. తిరుపతి, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూట్ జరుగుతోంది. ఐతే, 'గాయత్రి' సెట్స్‌లోకి బాలయ్య రావడంతో యూనిట్ సభ్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. వున్నట్లుండి బాలకృష్ణ రావడం వెనుక ఏమైనా విశేషం వుందా? అంటూ చర్చించుకోవడం మొదలైంది. బాలయ్య వచ్చే సమయానికి మోహన్‌బాబు లేకపోవడం విష్ణుతో కలిసి కాసేపు ముచ్చటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

బాలకృష్ణ - జైసింహ, మోహన్‌బాబు- గాయత్రి ఒకే స్టూడియోలో చిత్రీకరణ జరిగింది. ఈ సమయంలోనే బాలయ్య అక్కడికి వెళ్లాడు. అందుకు సంబంధించిన పిక్ ఇప్పుడు బయటకువచ్చింది. పక్కన రైటర్ తోటపల్లి మధు కూడా వున్నాడు. ఈ చిత్రం లో కలెక్షన్‌కింగ్ మోహన్‌బాబు డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని, ఒకటి హీరో కాగా, మరొకటి విలన్ రోల్. మదన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ నిఖిల, యాంకర్ అనసూయ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com