గుండె పోటుతో మరణించిన గోవాకి చెందిన ప్రవాసియ భారతీయుడు
- December 13, 2017
కువైట్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కొందరు ప్రవాసీయులు ఆకస్మికంగా మరణించి తమ కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. గోవా నుండి భారత జాతీయుడు డిగో రిమ్మీ ఫెర్నాండెజ్, అద్దెకు కార్లను ఇచ్చేఅల్-సేయర్ సంస్థలో పని చేసేవారు. ఆయన 58 సంవత్సరాల వయస్సులో గుండెకు సంబంధించిన వ్యాధి కార్డియక్ అరెస్ట్ కారణంగా ఈ నెల 10 వతేది (గురువారం) ఆకస్మికంగా చనిపోయారు. ఉన్నాడు. తన భార్య జోసెఫిన్ ఫెర్నాండెజ్ మరియు కుమార్తె డయానా ఫెర్నాండెజ్ లను అనాథలను చేసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. కాగా డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు రేపు 14/12/2017 ( (గురువారం) ఉదయం 11:30 గంటలకు కువైట్ నగరంలోని హోలీ ఫ్యామలీ కేథడ్రల్ చర్చి వద్ద జరుగుతాయి. ది క్రిస్టియన్ సెమెట్రీ , సులైబికత్ వద్ద ఖననం చేయబడుతుంది. డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ ఆత్మకు శాంతి కలగాలని కువైట్ లోని పలువురు ప్రవాస భారతీయులు ప్రార్థిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







