గుండె పోటుతో మరణించిన గోవాకి చెందిన ప్రవాసియ భారతీయుడు
- December 13, 2017
కువైట్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కొందరు ప్రవాసీయులు ఆకస్మికంగా మరణించి తమ కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. గోవా నుండి భారత జాతీయుడు డిగో రిమ్మీ ఫెర్నాండెజ్, అద్దెకు కార్లను ఇచ్చేఅల్-సేయర్ సంస్థలో పని చేసేవారు. ఆయన 58 సంవత్సరాల వయస్సులో గుండెకు సంబంధించిన వ్యాధి కార్డియక్ అరెస్ట్ కారణంగా ఈ నెల 10 వతేది (గురువారం) ఆకస్మికంగా చనిపోయారు. ఉన్నాడు. తన భార్య జోసెఫిన్ ఫెర్నాండెజ్ మరియు కుమార్తె డయానా ఫెర్నాండెజ్ లను అనాథలను చేసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. కాగా డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు రేపు 14/12/2017 ( (గురువారం) ఉదయం 11:30 గంటలకు కువైట్ నగరంలోని హోలీ ఫ్యామలీ కేథడ్రల్ చర్చి వద్ద జరుగుతాయి. ది క్రిస్టియన్ సెమెట్రీ , సులైబికత్ వద్ద ఖననం చేయబడుతుంది. డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ ఆత్మకు శాంతి కలగాలని కువైట్ లోని పలువురు ప్రవాస భారతీయులు ప్రార్థిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







