గుండె పోటుతో మరణించిన గోవాకి చెందిన ప్రవాసియ భారతీయుడు
- December 13, 2017
కువైట్ : ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన కొందరు ప్రవాసీయులు ఆకస్మికంగా మరణించి తమ కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. గోవా నుండి భారత జాతీయుడు డిగో రిమ్మీ ఫెర్నాండెజ్, అద్దెకు కార్లను ఇచ్చేఅల్-సేయర్ సంస్థలో పని చేసేవారు. ఆయన 58 సంవత్సరాల వయస్సులో గుండెకు సంబంధించిన వ్యాధి కార్డియక్ అరెస్ట్ కారణంగా ఈ నెల 10 వతేది (గురువారం) ఆకస్మికంగా చనిపోయారు. ఉన్నాడు. తన భార్య జోసెఫిన్ ఫెర్నాండెజ్ మరియు కుమార్తె డయానా ఫెర్నాండెజ్ లను అనాథలను చేసి తిరిగిరాని లోకాలకు పయనమయ్యాడు. కాగా డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ అంత్యక్రియలు రేపు 14/12/2017 ( (గురువారం) ఉదయం 11:30 గంటలకు కువైట్ నగరంలోని హోలీ ఫ్యామలీ కేథడ్రల్ చర్చి వద్ద జరుగుతాయి. ది క్రిస్టియన్ సెమెట్రీ , సులైబికత్ వద్ద ఖననం చేయబడుతుంది. డిగో రిమ్మీ ఫెర్నాండెజ్ ఆత్మకు శాంతి కలగాలని కువైట్ లోని పలువురు ప్రవాస భారతీయులు ప్రార్థిస్తున్నారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









