పల్లీలు గుండెకు మేలు.!
- December 13, 2017
పల్లీలు ఆరోగ్యానికి మంచిది కాదు, వాటిని తీసుకుంటే కొవ్వు పెరుగుతుంది తదితర అనుమానాలు చాలా మందిలో ఉంటాయి. అవి కేవలం అపోహలు మాత్రమేననీ, పల్లీలు ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి అంటున్నారు పరిశోధకులు. మధ్యాహ్నం భోజనంతో పాటు కొన్ని పల్లీలు నేరుగా లేదా షేక్ రూపంలో తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందన్న విషయం వీరి పరిశోధనలో వెల్లడైంది. పదహారు మందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపువారికి మధ్యాహ్నం భోజనం తరువాత గుప్పెడు పల్లీలు ఇచ్చారు. రెండో గ్రూపు వారికి సాధారణ డ్రింక్ను ఇచ్చారు కొన్ని గంటల అనంతరం వీరిని పరీక్షించగా, పల్లీలు తీసుకున్న వారిలో ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గిన విషయాన్ని గుర్తించారు. మామూలుగా భోజనం అనంతరం రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి పెరుగుతుంది. రక్తంలో వీటి స్థాయి పెరిగితే గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. పల్లీలు తినడం వలన వీటి స్థాయి పెరగకుండా తగ్గడం అనేది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. అయితే చక్కెర వ్యాధిగ్రస్తులు పల్లీలు తీసుకునే విషయంలో వైద్యుల సలహా తీసకోవడం తప్పనిసరి అని వారు అంటున్నారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









