ఇది వంద అనారోగ్యాలను రానివ్వదు
- December 15, 2017
పోషకాహార లేమితో బాధపడే వారికి తేనె దివ్య ఔషధం. తేనెను ప్రతిరోజు తీసుకుంటే దాదాపు వంద రకాల అనారోగ్యాలు దరికిరావని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. తేనెలో విటమిన్ సితో పాటు ప్రొటీన్స్, ఆమైనోఆమ్లాలు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, జింక్, సోడియం, వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫ్రక్రోజ్ 38 శాతం, గ్లూకోజ్ 31శాతం, సుక్రోజ్ 1 శాతం, నీరు 17శాతం ఇతరత్రా చక్కెరలు 9 శాతం ఉంటాయి. పంచదారతో పోలిస్తే తేనెలో కేలరీలు ఎక్కువ. తేనెలోని పిండి పదార్థాలు సులభంగా గ్లూకోజ్గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణ మౌతాయి. వేడినీటిలో ఒక స్పూను తేనె, దాల్చిన చెక్క పొడి వేసి, బాగా కలిపి, ఆ నీటిని కొద్దిసేపు పుక్కిలిస్తే నోటి దుర్వాసన పరారవుతుంది. తేనె, దాల్చిన చెక్క పొడిని కలిపి బ్రెడ్ స్లైస్ మీద రాసుకుని తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ విధంగా రోజుకు మూడు పూటలా తింటే క్యాన్సర్ దరికిరాదు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులకు తేనె, దాల్చిన చెక్కల మిశ్రమం దివ్య ఔషధంగా పనిచేస్తుంది. తేనె సూక్ష్మజీవుల సంహారిణి. బాక్టీరియా, ఈస్ట్ వంటి సూక్ష్మజీవులను ఎదగనివ్వదు. తేనెలోని కార్బోహైడ్రేట్లు తక్షణ శక్తిని అందిస్తాయి.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







